ప్రేమించి… పెళ్లిచోసుకోక పోవడంతో యువతి ఆత్మహత్య

తన ప్రేమని నిరాకరించిందని కక్ష పెంచుకున్న యువకుడు

తెలంగాణలో మరో ఘటన గుండెలను పిండీస్తుంది. మహబూబ్ నగర్ లో జరిగిన ఈ ఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రేమ వ్యవహారంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అమ్రాబాద్ మండలం ప్రశాంత్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రశాంత్‌నగర్‌ గ్రామానికి చెందిన కళమ్మ అనే మహిళ భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. దీంతో ముగ్గురు కూతుళ్లను తల్లే పెంచి పెద్ద చేసింది. పెద్ద కుమార్తెకు పెళ్లైపోయింది. ఇక ఇద్దరు కూతుళ్లతో కళమ్మ కలిసి బ్రతుకు ఈడుస్తోంది. దీంతో తాజాగా ఇంటి నుంచి బయటికి వెళ్లిన రెండో కుమార్తె సుమలత చాలా సమయం అవుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం తల్లి, చెల్లి గాలించగా పాత ఇంట్లోని దూలానికి ఉరేసుకొని విగతజీవిలా పడి ఉంది.

అయితే ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పోచయ్య సిబ్బందితో కలిసి ప్రశాంత్‌నగర్‌ గ్రామానికి వచ్చి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. తర్వాత పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని అమ్రాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. తన కూతురు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సుమలత తల్లి కళమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు, సుమతల మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని.. ఎన్నిసార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా అతడు దాటవేస్తుండటంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.