ప్రాణాలు తీసుకున్న ప్రేమ జంట

ప్రాణాలు తీసుకున్న ప్రేమ జంట

టీనేజీలోనే ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు విడిచి ఉండలేమనుకున్నారు. వివాహ బంధంతో తమ ప్రేమను పండించుకోవాలనుకున్నారు. అయితే వాళ్లొకటి తలిస్తే పెద్దలు మరొకటి తలిచారు. ప్రేమ వివాహానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కలిసి జీవించలేనప్పుడు కలిసి చనిపోవడమే మంచిదని నిర్ణయానికి వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

ఆత్మకూరు గిరిజన కాలనీకి చెందిన సోమా నవీన్ (20), ఆయేషా (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. ఎంత నచ్చజెప్పినా రెండు కుటుంబాల వారు ససేమిరా అనడంతో ఈ ప్రేమజంట పొలాల్లో విషగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

అపస్మారక స్థితిలో వీరిని గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆత్మకూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.