
శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించిన తాజా చిత్రం ‘మా రాముడు అందరివాడు’ Maa Ramudu Andarivadu. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 4న ఈ సినిమా 200కు పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. సినిమాలో తాను ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. హీరో శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో నటించి ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. మంచి కథ, ఆసక్తికరమైన కథనంతో రూపొందిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు.
చిత్ర నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. సినిమాను మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించినట్లు తెలిపారు. తాను ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించినట్లు వెల్లడించారు. సుమన్, తన మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.
దర్శకుడు యద్దనపూడి మైకిల్ మాట్లాడుతూ.. ‘మా రాముడు అందరివాడు’లో తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా ఉంటుందని తెలిపారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని పేర్కొన్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్తో రూపొందుతున్న చిన్న సినిమాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన వెంకట్ దుగ్గిరెడ్డి, శ్రీనివాస తేజ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చిత్ర బృందం నమ్మకంగా ఉంది.