టాలీవుడ్ హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’ Mahendragiri Varahi విడుదలకు సిద్ధమవుతోంది. సోషియో ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
‘మహేంద్రగిరి వారాహి’కి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 11న ఈ చిత్రాన్ని గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
పురాతన మహేంద్రగిరి ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో వారాహి అమ్మవారికి సంబంధించిన ఓ మిస్టీరియస్ శాపం కీలకంగా ఉండనుంది. ఓ రాజవంశానికి చెందిన పురుష వారసులు 33 ఏళ్ల వయస్సులోనే వరుసగా మరణిస్తుండటం ఈ కథలో ప్రధాన అంశంగా నిలుస్తుంది. గత 150 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ మరణాలను దైవాగ్రహంగా భావిస్తుండగా.. దీని వెనుక దాగి ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించి, ఆ శాపానికి ముగింపు పలికేందుకు సుమంత్ పాత్ర చేసే పోరాటమే ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది.
ఈ చిత్రంలో సుమంత్కు జోడీగా మీనాక్షి గోస్వామి నటించగా, ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో ప్రత్యేక క్యామియో రోల్లో సందడి చేయనున్నాడు.
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కాళిపు మధు, సురభి లక్ష్మణ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సెన్సార్ పూర్తి కావడంతో ఇప్పుడు సెప్టెంబర్ 11న ‘మహేంద్రగిరి వారాహి’ ఎలాంటి థియేట్రికల్ రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.


