జగన్ కు మరో సీనియర్ నేత షాక్…!

Meesala Neelakantam Naidu Join TDP

ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టికెట్ రాదనుకున్న వారు, వేరే పార్టీలోకి వెళ్తే టికెట్ గానీ ఏదైనా ప్రాధాన్యమున్న పదవి గానీ వస్తుందనుకున్న నాయకులు వరసగా పార్టీ మారే పనిలో పడ్డారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే, వైకాపా కీలక నేత మీసాల నీలకంఠంనాయుడు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో నీలకంఠం నాయుడు ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. కలుపుగోలుగా ఉండే నీలకంఠంనాయుడుకి జి.సిగడాం మండలంలో మంచి గుర్తింపు ఉంది.

cm-party

జి.సిగడాం మండలంలో ఆయన రెండు సార్లు, ఆయన భార్య లక్ష్మి ఒకసారి ఎంపీపీగా వ్యవహరించారు. ఇక ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళావెంకటరావు, నీలకంఠంనాయుడుల మధ్య బంధుత్వం కూడా ఉంది. వైసీపీలో సరైన గౌరవం లభించలేదని నీలకంఠంనాయుడు మదనపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నీలకంఠంనాయుడు 2014కు ముందు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించగా ఆయనకు దగ్గలేదు. అప్పటి నుండి కూడా ఏదైనా ప్రాధాన్యమున్న పదవి వస్తుందని భావించినా అదీ రాలేదు. దీంతో తాజాగా టీడీపీలోకి వచ్చేందుకు నీలకంఠం నాయుడు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

mesala-nelakanta-naidu