జీ-20లో కొత్త దేశానికి సభ్యత్వం..

Membership of new country in G-20
Membership of new country in G-20

భారత్ ఆతిత్యమిస్తున్న జీ-20 సదస్సు ప్రగతి మైదానంలో భారత మండపంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ప్రపంచ దేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. అనంతరం తన ప్రసంగంతో మోడీ సదస్సును ప్రారంభించారు. మొరాకాలో సంభవించిన భూకంపంపై మోడీ స్పందించారు . ఈ సంఘటన చాాలా విచారకరమన్నారు.భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. మొరాకోకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

జీ-20లో కొత్త దేశానికి సభ్యత్వం ఇచ్చారు. ఆఫ్రికన్ యూనియన్ కి సభ్యత్వం ఇచ్చింది జీ20. ఆప్రికన్ యూనియన్ సభ్యత్వానికి భారత్ మద్దతు ప్రకటించింది. జీ20లో ఇప్పటివరకు 19 దేశాలు, యురోపియన్ యూనియన్ దేశాలున్నాయి. ఇప్పుడు ఈ 19 దేశాలతో పాటు ఆప్రికన్ యురోపియన్ యూనియన్ లు ఉన్నాయి.ఈ ఏడాది సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఆఫ్రికన్ యూనియన్ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో హాజరైంది.