National Politics: వివాస్పద వ్యాఖ్యలు చేసిన జ్యోతి మిర్దా..!

National Politics: Jyoti Mirda who made controversial comments..!
National Politics: Jyoti Mirda who made controversial comments..!

ఈ సారి కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పడితే, దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ప్రతిపక్షాలు నిరంతరం వాదిస్తున్న సంగతి తెలిసిందే. విపక్షాల ఈ వాదనల మధ్య రాజస్థాన్లోని నాగౌర్కు చెందిన లోక్సభ బీజేపీ అభ్యర్థి జ్యోతి మిర్ధా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైంది. అందులో ఆమె రాజ్యాంగంలో మార్పుల గురించి మాట్లాడటం కనిపిస్తుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘కొన్ని సార్లు కఠోర నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం మనం రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకు లోక్సభ, రాజ్యసభ రెండింట్లో బలం కావాలి. లోక్సభలో బీజేపీకి కావల్సినంత మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం తక్కువ మెజారిటీ ఉందన్నారు. మూడోసారి కూడా NDA ప్రభుత్వం వస్తేనే ఇదంతా సాధ్యం’ అని మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.