మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది రియాజ్ హ‌తం..

జ‌మ్మూక‌శ్మీర్‌లోని భ‌ద్ర‌తా ద‌ళాలు మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది రియాజ్ నైకూను మట్టుబెట్టాయి. గత రాత్రి నుంచి జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది రియాజ్ భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో మృతి చెందాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో రాత్రి నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. అయితే బేగ్‌పుర గ్రామంలో ఉగ్ర‌వాది రియాజ్ ఉన్న‌ట్లు గుర్తించారు. హిజ్‌బుల్ ముజాయిద్దీన్ క‌మాండ‌ర్ అయిన రియాజ్ త‌ల‌పై 12 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. అయితే మ‌రో చోట జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆర్మీ వెల్లడించింది. పాంపోర్ జిల్లాలోని శార్‌షాలి గ్రామంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఆ ఉగ్ర‌వాదులు మృతి చెందారు.

అదేవిధంగా రియాజ్ నైకూ కోసం గ‌త 8 ఏళ్ల నుంచి క‌శ్మీర్‌లోని భ‌ధ్ర‌తా ద‌ళాలు గాలిస్తున్నాయి. 2016లో క‌శ్మీర్‌లో మిలిటెంట్ నేత బుర్హ‌న్ వానీ హ‌త‌మైన త‌ర్వాత నైకూ ఉగ్ర‌నేత‌గా ఎదిగాడు. క‌శ్మీర్‌లో స్థానిక పోలీసుల్ని చంప‌డంలో రియాజ్ మాస్ట‌ర్‌మైండ్‌ ఉపయోగించాడు. దీంతో ద‌క్షిణ క‌శ్మీర్ జిల్లాల్లో పోలీసులు ఒంట‌రిగా తిరిగేవారు కాదు. ఉగ్ర‌వాద గ్రూపులో చేర‌క‌ముందు నైకూ స్థానిక స్కూల్‌లో లెక్క‌ల టీచ‌ర్‌గా పని చేశాడు. గులాబీ పువ్వుల పెయింటింగ్ వేయ‌డంలో ఇత‌ను దిట్ట‌. కాగా 33 ఏళ్ల వ‌య‌సులో రియాజ్‌.. ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లి ఇప్పుడు ఇలా భద్రతాదళాల మధ్యం హతం అయ్యాడు.