భూపాలపల్లిలో తల్లీబిడ్డల మృతి

భూపాలపల్లిలో తల్లీబిడ్డల మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారితో కలసి తల్లి అఘాయిత్యం చేసుకుంది. భూపాలపల్లిలోని జవహర్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న సంగరి లాస్య(25) తన రెండున్నరేళ్ల కూతురు మహితితో కలసి ఆత్మహత్య చేసుకుంది.

ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లీబిడ్డల మృతితో కాలనీలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.