ముగ్గురు పిల్లలకు నిప్పుపెట్టిన తల్లి

ముగ్గురు పిల్లలకు నిప్పుపెట్టిన తల్లి

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో రెండు విషాద సంఘటలు అనుబంధాలను ఆవిరి చేశాయి. భర్త వేధింపులను తట్టుకోలేక ఓ తల్లి ముగ్గురు పిల్లలకు నిప్పుపెట్టి తానూ నిప్పటించుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని విజయపుర (బిజాపుర) జిల్లా ఆసుపత్రికి తరలించగా, తల్లి కొద్ది గంటల్లోనే చనిపోయింది. ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతూ రెండురోజుల తరువాత మృతి చెందారు.

జమఖండి తాలూకా మదురఖండి గ్రామ నివాసి బిస్మిల్లా (28) అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆదివారం అర్ధరాత్రి యసీదా (6) సనా (4) అనే ఇద్దరు ఆడపిల్లలు మృతిచెందారు. మూడో కుమారుడు సమీర్‌ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ విషయమై భార్యాభర్త తరచూ గొడవ పడేవారు. భర్త దస్తగిరి సాబ్‌ను జమఖండి పోలీసులు అరెస్ట్‌ చేశారు.