టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రమైన ఆగ్రహం

టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రమైన ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అధికారిక వైసీపీ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని, రాజధాని విషయంలో వైసీపీ నేతలందరూ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కొన్ని ఆగ్రహపూరిత వాఖ్యలు చేశారు.

కాగా రాజధానిని అమరావతి నుండి తరలించడం ఎవరి తరం కాదని, రైతులను కష్టపెట్టిన వాడు ఇంతవరకు ఎవడు కూడా బాగుపడలేదని, జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని ఆరోపించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతి కోసం తామందరం కూడా చట్టపరంగా, న్యాయపరంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. కాగా ప్రపంచం అంతా కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఉంటె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రైతులకు గొప్ప బహుమతి ఇచ్చారని, పండగ పూట రైతులందరిని రోడ్డున నిలబెట్టారని, ఇదే రాష్ట్రంలోని రైతులకు సీఎం జగన్ ఇచ్చిన అద్దిరిపోయే బహుమానమని టీడీపీ నేత కేశినేని నాని ఎద్దేవా చేశారు.a