కేంద్ర రైల్వే మంత్రి పీయూష్గోయల్ను టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి కలిశారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ యార్డు విస్తరణ నిమిత్తం.. రామచంద్రాపురం నుంచి పటాన్చెరు వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రైల్వే శాఖ భూములను అప్పగించాలని కోరారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా భేటీ అయ్యారు. ప్రజలతో ఉండి అభివృద్ధికి బాటలువేయాలని ఉపరాష్ట్రపతి సూచించారని ప్రభాకర్రెడ్డి తెలిపారు.