Election Updates: BREAKING NEWS: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి జరిగింది..!

Election Updates: BREAKING NEWS: Medak MP Kota Prabhakar Reddy was attacked with a knife..!
Election Updates: BREAKING NEWS: Medak MP Kota Prabhakar Reddy was attacked with a knife..!

తెలంగాణాలో మరో 30 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ , కాంగ్రెస్ మరియు బీజేపీలు గెలు మాదంటే మాదే అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఆసక్తికరంగా మార్చేశాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రచారంలో పాల్గొన్న ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తి దాడి జరిగింది. పూర్తి వివరాల ప్రకారం దౌలతాబాద్ మండలం లోని సూరంపల్లిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి సడెన్ గా గుంపులో నుండి వచ్చి అతనిపై కత్తితో దాడి చేశాడు.

ఈ ఘటనతో అలెర్ట్ అయినా బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే రాజును పట్టుకుని చితకబాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దారిపతును చేపట్టారు. కాగా గాయపడిన ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ లోని హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఈ విషయంపై అప్డేట్ రావాల్సిన ఉంది.