Election Updates: ఈ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకు పోలింగ్: ఈసీ

Election Updates: Polling till 4 pm in these 13 constituencies: EC
Election Updates: Polling till 4 pm in these 13 constituencies: EC

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పోలీసు, ఇతర శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలకు తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మార్గనిర్దేశం చేసింది. ఇక తాజాగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగుస్తుందని నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 13 నియోజకవర్గాలను ఈ తరహాగా గుర్తించినట్లు తెలిపింది. సిర్పూర్, భద్రాచలం చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వెల్లడించింది. ఈ 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన 106 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు వివరించింది.