ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫై వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తుఫాన్లను నియంత్రించగల అతీంద్రియ శక్తులు కలిగిన చంద్రబాబు నాయుడి ఫై ప్రపంచమంతా చూస్తోంది అని సెటైర్లు వేశారు. కరోనా వైరస్ నుండి రక్షించేందుకు చంద్రబాబు ఎదో ఒకటి చేయకపోతే భూమి మీద మనుషులు మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతా ఆందోళన చెందుతున్నారని విమర్శలు చేసారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు స్పందిస్తున్నారు.

తుఫాన్లని నియత్రించగల అతీంద్రియ శక్తులు గల చంద్రబాబు ఒక వైపు, వర్షాలు రప్పించగల బ్రదర్ అనిల్ కుమార్ మరో వైపు ప్రపంచమంతా చూస్తుంది అని సెటైర్లు వేస్తున్నారు. కరోనా వైరస్ బారి నుండి వారు ఎదో ఒకటి చేయకపోతే భూమి మీద మనుషులు మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అంతా ఆందోళన చెందుతున్నారు అని ఘాటుగా జవాబిచ్చారు. దొందూ దొందే అంటూ విమర్శలు గుప్పించారు.