హైదరాబాద్ లో రౌడీషీటర్ దారుణ హత్య…..

Son arrested for slaying father

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. రాజధాని హైద‌రాబాద్‌లో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. అయితే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీఅండ్టీ కాల‌నీలో అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అసలు విషయం ఏమిటంటే.. వినయ్ అనే రౌడీషీటర్‌ను దుండగులు హత్య చేశారు. హ‌త్య‌కు గురైన విన‌య్‌ గౌలిగూడ వాసిగా పోలీసులు వెల్లడిస్తున్నారు.

 హత్యకు పాల్పడిన సంతోష్ కుమార్, సందీప్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ‌ఇద్ద‌రూ సంతోష్‌న‌గ‌ర్‌కు చెందిన‌ వారిగా పోలీసులు గుర్తించారు. కాగా విన‌య్‌ని అతి దారుణంగా గొంతుకోసి హ‌త్య‌ చేసిన త‌ర్వాత‌.. అత‌డి త‌ల్లికి ఫోన్ చేసి.. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి నిందితులు పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు వినయ్ హత్యకు సంబంధించి కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు జరుపుతున్నారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం విన‌య్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే ప‌రారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.