పట్టపగలే దారుణ ఘటన

పట్టపగలే దారుణ ఘటన

విజయవాడలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. దుర్గా అగ్రహారంలో శుక్రవారం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.

దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్నపోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హత్యా ఘటనతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.