విశాఖలో మర్డర్…బైక్ మీద నుండి బైక్ మీద ఎటాక్

murder in vishaka

విశాఖ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోడవరంలో నడిరోడ్డుపై బైక్ మీద వెళుతున్న యువకుడ్ని గుర్తు తెలియని ఒక దుండగుడు కిరాతకంగా చంపేశాడు. బీఎన్ రోడ్డులోని ఓ వైన్ షాపు దగ్గర బైక్‌‌పై వెళుతున్న యువకుడ్ని హెల్మెట్ పెట్టుకొని మరో బైక్‌పైన వచ్చిన దుండగుడు అడ్డగించాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి మెడ ఓ వేటు వేశాడు. బైక్‌పై మీద నుండి యువకుడు కిందపడిపోగానే నిందితుడు ముందుకు వెళ్లిపోయాడు. మళ్లీ వెనక్కు వచ్చి కత్తితో మళ్లీ నరికి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మృతుడు చోడవరంలోని ఎడ్లవీధికి చెందిన కోన రాజేష్‌గా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేష్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలతో హత్య జరిగిందా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కేసు విచారణ జరుపుతున్నారు. యువకుడిపై దాడి చేసిన వ్యక్తి ఎవరు.. హత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. హత్య జరిగిన సమయంలో కొందరు ఘటనను వీడియో తీసినట్లు తెలుస్తోంది. దీని మీద మరింత క్లారిటీ రావలసి ఉంది.