ఎట్టకేలకు చైతూను ఒప్పించాడ

Naga Chaitanya Finally Convinced

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రవితేజతో ‘పవర్‌’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పవన్‌ కళ్యాణ్‌ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బాబీ ఆ వెంటనే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా ఆడకపోయినా కూడా ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ చిత్రాన్ని చేశాడు. ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలు పోషించిన జై లవకుశ చిత్రం యావరేజ్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. ఆ సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం ఎన్టీఆర్‌కు వెళ్లి పోయింది. దాంతో దర్శకుడు బాబీకి పెద్దగా మైలేజ్‌ దక్కలేదు. బాబీతో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు ఆసక్తి చూపకపోవడంతో కాస్త గ్యాప్‌ వచ్చింది. ఎట్టకేలకు చైతూతో సినిమాను బాబీ ఓకే చేయించుకున్నాడు.

నాగచైతన్యతో బాబీ ఒక చిత్రం చేయబోతున్నట్లుగా రెండు మూడు నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే బాబీకి చూద్దాం అని మాత్రమే నాగచైతన్య ఇన్నాళ్లు చెబుతూ వచ్చాడు. తాజాగా నాగచైతన్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న ‘సవ్వసాచి’, ‘శైలజరెడ్డి అల్లుడు’ చిత్రాలతో పాటు శివ నిర్వాణ చిత్రాలు పూర్తి అయిన తర్వాత అంటే ఈ సంవత్సరం ద్వితీయార్థం ప్రారంభంలో బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. బాబీ చెప్పిన స్టోరీకి చైతూ ఓకే చెప్పడం జరిగిపోయింది.

ఒక ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు. అతి త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ మూడు నెలల్లో బాబీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేయడంతో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను కూడా పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది. మూడు చిత్రాల్లో ఒకటి సూపర్‌ హిట్‌, ఒకటి ఫ్లాప్‌, ఒకటి యావరేజ్‌ హిట్‌లుగా నిలిచిన నేపథ్యంలో బాబీకి ఈ నాల్గవ చిత్రం ఏమేరకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.