పవన్ పై లోకేష్ పరువు నష్టం దావా వేస్తారా ?

Nara Lokesh Comments On Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేస్తున్న విమర్శల మీద టీడీపీ యువనేత, రాష్ట్ర మంత్రి లోకేష్ గొంతు విప్పారు. అమరావతిలో జర్నలిస్టులతో పిచ్చాపాటీగా మాట్లాడిన లోకేష్ తనపై పవన్ చేసిన ప్రతి ఆరోపణ గురించి మాట్లాడారు. సోషల్ మీడియాలో తాను శేఖర్ రెడ్డితో ఉన్నట్టు చెబుతున్న ఓ ఫోటో లో వున్నది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని లోకేష్ వివరణ ఇచ్చారు. ఆయన సినీ నటుడు రాజీవ్ కనకాల కి బావ కూడా. ఏ విషయాల గురించి లోతుగా తెలుసుకోకుండా ఎవరో చెప్పారని పవన్ అసత్య ఆరోపణలు చేశారని లోకేష్ అన్నారు. ప్రతినిత్యం రాత్రి 11 గంటల దాకా కష్టపడుతున్న తమకు 2.5 మార్కులు వేస్తారా అని లోకేష్ ఆవేదన చెందారు. అయినా పవన్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు.

పోలవరం మీద విచారణ అంటే కేంద్రం తన మీద తానే విచారణ జరుపుకున్నట్టు అని లోకేష్ అభిప్రాయపడ్డారు. పోలవరం ఖర్చు అథారిటీ కనుసన్నల్లో జరుగుతుందని, ఆ అథారిటీ కేంద్రం కనుసన్నల్లో నడుచుకుంటుందని లోకేష్ వివరించారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తనకు ఏ అవినీతితో సంబంధం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఏటా ప్రకటిస్తున్న ఆస్తుల కన్నా ఎక్కువ ఉంటే అలా చూపించిన వారే తీసుకోవచ్చని లోకేష్ అన్నారు. ఇక పవన్ మీద పరువు నష్టం దావా వేస్తారా అన్న ప్రశ్నకు దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.