Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో ఎంతో మంది వారసుల లాగే నారా రోహిత్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నందమూరి అభిమానుల అండదండలు ఉంటాయనే ఉద్దేశ్యంతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ వరకు వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ అవసరం. ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ ఏమీ పని చేయదని గతంలో పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది. తాజాగా నారా రోహిత్ విషయంలో కూడా అదే తేలిపోయింది. సునాయాసంగా ఎంట్రీ అయితే ఇచ్చాడు కాని సక్సెస్ కోసం, కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు.
సక్సెస్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నారా రోహిత్ ఇక లాభం లేదని విలన్ పాత్రలు చేసేందుకు కమిట్ అయ్యాడు. మంచి పాత్ర దొరికితే ఖచ్చితంగా విలన్గా నటిస్తాను అని, తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాను అంటూ ఇటీవలే చెప్పుకొచ్చాడు. ప్రకటన చేసిన కొన్నాళ్లకే ఈయనకు విలన్గా అవకాశం దక్కింది. అది కూడా వెంకటేష్ నటించబోతున్న సినిమాలో ఈయనకు ఛాన్స్ రావడం జరిగింది.
నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో దర్శకుడిగా ఫామ్లోకి వచ్చిన తేజ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసి వచ్చే నెల 15 నుండి చిత్రీకరణ ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్తో ఢీ కొట్టేందుకు తేజ విలన్ పాత్రకు గాను నారా రోహిత్ను ఎంపిక చేయడం జరిగింది. విలన్గా మారాలని నారా రోహిత్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ సినీ వర్గాల వారు మరియు ఆయన సన్నిహితులు కూడా మెచ్చుకుంటున్నారు. మరి హీరోగా సక్సెస్ కాలేక పోయిన నారా రోహిత్ విలన్గా అయినా మెప్పిస్తాడా, సక్సెస్లను దక్కించుకుంటాడా అనేది చూడాలి.