బెజవాడ పరుగులు తీసిన నేషనల్ మీడియా.

National Media to Vijayawada
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు మీడియా అంతా హైదరాబాద్ కే పరిమితం కావడంతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయాలు పెద్దగా ఫోకస్ కావడం లేదని అక్కడి ప్రజలకు అర్ధం అవుతోంది. ఇక నేషనల్ మీడియా సంగతి చెప్పనే అక్కర్లేదు. హైదరాబాద్ ని దాటి ముందుకు రాదు. దీంతో ఆంధ్రప్రదేశ్ సమస్యలు జాతీయ మీడియాలో రావడం బహు అరుదు. అయితే ఈ రోజు మాత్రం అడక్కుండానే నేషనల్ మీడియా బెజవాడ పరుగులు తీసింది. కేంద్ర బడ్జెట్ తో తీవ్ర నిరాశకు గురి అయిన చంద్రబాబు ఎంపీ లతో సమావేశం కావడమే ఇందుకు కారణం. ఈ భేటీలో బీజేపీ తో రాజకీయ బంధాన్ని వదులుకుని కొత్త కూటమి దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో జాతీయ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున విజయవాడ వచ్చారు.

ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా జాతీయ మీడియాకి సంబంధించిన ఓబీ వాన్స్ కూడా విజయవాడలో దర్శనం ఇస్తున్నాయి. ఇక తెలుగు మీడియా కూడా ఎన్నడూ లేనంతగా విజయవాడలో మకాం వేసింది.