దేవర సినిమాకు భారీగా కురవనున్న కలెక్షన్ల వర్షం

Devara Collections
Devara Collections
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా గ్రాండ్‌ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంతేకాకుండా మిడ్‌ నైట్‌ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర ఆరు షోలు ఆడించేందుకు థియేటర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చారు. ఇక.. ఆ తర్వాత రోజు (సెప్టెంబర్ 28) నుంచి అక్టోబర్‌ 6 వరకు రోజుకు 5 షోలు మాత్రమే ఆడించుకునేలా వెసులుబాటు కల్పించింది.
అయితే మిడ్ నైట్ షోలు ఆడించేందుకు 29 థియేటర్లకు అనుమతించింది సర్కార్. మరోవైపు.. తొలిరోజు టికెట్‌ ధరలను ఏకంగా రూ.100 పెంచుకునేందుకు పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక.. సింగిల్‌ స్క్రీన్‌లలో అయితే.. టికెట్‌పై రూ.25, మల్టీప్లెక్స్‌లలో రూ.50 పెంచే  అవకాశం కల్పించింది. దీంతో.. తెలంగాణలో థియేటర్లకు దేవర కాసుల వర్షం కురిపించనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దేవర సినిమాకు కావాల్సినంత సౌలభ్యాన్ని కల్పించింది. టికెట్ రేట్లను భారీగా పెంచేందుకు అనుమతిని ఇచ్చింది. మల్టీప్లెక్సుల్లో రూ.130, సింగిల్ స్క్రీన్లలో రూ.110 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక.. మిడ్ నైట్ షోలకు కూడా ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో రిలీజ్ రోజున ఆరు షోలు ఆడనున్నాయి. ఆ తర్వాత నుండి 5 షోలు ఆడించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ పెంచిన రేట్లు, అదనపు షోలు 9 రోజుల పాటు కొనసాగేలా ఏపీ సర్కార్ కల్పించింది. దీంతో.. అటు ఏపీలోనూ దేవర కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందన్న అంచనాలు ఏర్పడ్డాయి.