17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

om birla as seventeenth loksabha speaker

రాజస్థాన్ అందించిన ఘనవిజయానికి భహుమతి స్పీకర్ రూపంలో లభించింది. 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ పేరు ప్రతిపాదించగా.. అన్ని పక్షాలు పూర్తిస్థాయి మద్దతు తెలిపాయి. అనంతరం ఆయనను స్పీకర్ స్థానానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తదితరలు తీసుకొని వెళ్లారు. మెన్నటి సాదారణ ఎన్నికల్లో 25 స్థానాలు స్వీఫ్ చేసిన రాజస్థాన్‌కు చెందిన కోటా పార్లమెంట్ సభ్యుడు ఓం ప్రకాష్ బిర్లా పేరును తెరపైకి తీసుకొచ్చి బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. గతం సభలో స్పీకర్ గా పనిచేసిన సుమిత్ర మహజన్ 7సార్లు లోక్ సభ సబ్యురాలిగా పనిచేసి గత ఎన్నికలలో పోటీనుంచి తప్పుకున్నారు, దీంతో కేవలం రెండవసారి లోక్ సభకి ప్రాతినిద్యం వహిస్తున్న వ్యక్తికి మోది అత్యంత కీలకమైన స్పీకర్ పదవి కట్టబెట్టడం విశేషం