సైలెన్సర్ లేని బైక్…పేలిన గన్…పవన్ హాట్ కామెంట్స్ !

ఏపీ రాజకీయాలు ఇప్పుడు పర్సనల్ అవుతున్నాయి. నలుగురు పెళ్ళాలని మార్చిన పవన్ ఇప్పుడు పతివ్రతలా మాట్లాడుతున్నాడు అని జగన్ పవన్ ని విమర్శిస్తే, జగన్ నిత్య రసికుడు అని, బ్రోకర్ జగన్ అనీ విమర్శలు మొదలుపెట్టారు జనసైనికులు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జనసేన పోరాటయాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కాలు బెణకడంతో భీమవరంలో పవన్‌ విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానులతో ఆయన ముచ్చటించారు.
తమను పోలీసులు ఇబ్బంది పెడ్తున్నారని, బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని ఈ సందర్భంగా అభిమానులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల అభిమానులు నిర్వహించిన ఓ ర్యాలీలో బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ రొద చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా పవన్ వద్ద ప్రస్తావించారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్‌ సైలెన్సర్‌ తీసి శబ్ధం చేస్తే తప్పంటున్నారని, తుపాకీతో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల అంశాన్ని ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఈ విమర్శలు చేసినప్పటికీ, ఇవి హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి చేసినవేనని అర్ధం అవుతోంది.

2004లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలగా, నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గాయపడగా ఆ కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఎవరు కాల్చారో తనకు తెలియదని బెల్లంకొండ చెప్పడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా న్యాయస్థానం ఈ కేసును కొట్టేసింది. ఇప్పుడు పవన్ వ్యాఖ్యల నేపధ్యంలో తెలుగుదేశం ఏమని సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.