జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చేయదు : పవన్ కళ్యాణ్

జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చేయదు : పవన్ కళ్యాణ్

ప్రస్తుత కాలంలో నిత్యావసరాల ధరలు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఉలిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబందించిన సమస్య కాదు. దేశం మొత్తం కూడా ఉల్లి లేక అల్లాడుతున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమస్య తీవ్రంగానే ఉందని చెప్పాలి. కాగా ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు దారుణమైన విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై మరొకసారి విరుచుకపడ్డారు.

కాగా ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, జగన్ రెడ్డి గారు చేసే మేలు ఉల్లి కూడా చేయదు. అందుకే ఉల్లి ఎందుకు సిల్లీగా అంటూ దాని రేటును అమాంతం పెంచేశారు’ అని పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కాగా ప్రజలకు సంబందించిన నిత్యావసరాల ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా దారుణంగా విఫలమైందని, ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని పవన్ కళ్యాణ్ అందరికి తెలిసేలా పోస్టు చేశారు.