పరిటాల ఇంటికి పవన్…గుండు కథ కి చెక్.

Pawan Kalyan Visited Paritala Ravi House
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పరిటాల కుటుంబం గురించి మాట్లాడుకున్నా, పవన్ వ్యవహారశైలి గురించి పట్టించుకున్న ముందుగా అందరికీ గుర్తొచ్చేది గుండు కథ. పరిటాల రవి అప్పట్లో ఓ ఇంటి వివాదంలో పవన్ కి గుండు కొట్టించారని జోరుగా సాగిన ప్రచారం. అందులో నిజం లేదని బతికున్న రోజుల్లో రవి, ఇప్పుడు వారి కుటుంబం, పవన్ కళ్యాణ్ చెబుతూనే వున్నా ఇంకా కొందరు అది జరిగిందనే భ్రమలో వున్నారు. ఆ భ్రమలు కూడా తొలిగిపోయి సంఘటన నేడు జరిగింది. అనంతపురం జిల్లా పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉదయం స్వయంగా పరిటాల ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. పరిటాల కుటుంబసభ్యులతో కలిసి రాయలసీమ రుచులు చూసారు.

పవన్ కి పరిటాల కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. అల్పాహార విందు తర్వాత మంత్రి సునీతమ్మతో పవన్ భేటీ అయ్యారు. నిన్న అనంత రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాల్ని సునీతమ్మ ముందుంచారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విందు అనంతరం కూడా ప్రజాసమస్యల పరిష్కారమే ఉద్దేశంగా తన ప్రతి అడుగు పడుతుందని ఆయన చెప్పారు.

ప్రజాసమస్యల గురించి మంత్రి పరిటాల సునీతతో పవన్ భేటీ అయినప్పటికీ దీని వెనుక రాజకీయ కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా చర్చ మొదలైంది. టీడీపీ తో పవన్ కాస్త సానుకూల వైఖరి ప్రదర్శించడం కొత్త కాకపోయినా ఈ భేటీ తో ఆ విధానంలో ఇంకా మార్పు లేదని చెప్పినట్టు అయ్యింది. ఇక ఎప్పటినుంచో ప్రచారంలో వున్న పవన్ కి పరిటాల రవి గుండు కొట్టించారన్న కథ కి చెక్ చెప్పినట్టు అయ్యింది.