తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, మమితా బైజు హీరోయిన్గా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైనప్పటి నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకు మంచి స్పందన లభించడంతో పాటు భారీ వసూళ్లు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, సూర్య కెరీర్లో మరో బిగ్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవడంతో సినిమా కలెక్షన్లు రోజురోజుకూ మరింత బలపడుతున్నాయి.
ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు కొనసాగుతోంది. తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్లో 2 మిలియన్ యూఎస్ డాలర్ల గ్రాస్ మార్క్ను ఈ చిత్రం దాటేసింది. ఇందులో తెలుగు వెర్షన్ వాటా ఎక్కువగా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో యూఎస్ మార్కెట్లోనూ ఈ సినిమా సూర్యకు మంచి విజయాన్ని అందించిన చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.





