కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ వెంకీ అట్లూరితో సినిమా చేయాలనే తన కోరిక గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘లక్కీ భాస్కర్’ తర్వాత వెంకీ అట్లూరి చెప్పే ఏ కథకైనా తాను వెంటనే ఓకే చెప్పేవాడినని సూర్య తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయాలని చాలా కాలంగా మనస్ఫూర్తిగా కోరుకున్నానని చెప్పారు.
అయితే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కంటే ముందే వెంకీ అట్లూరి తనను ఓ బయోపిక్ కథతో సంప్రదించారని సూర్య వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని తెలిపారు. దీంతో అసలు వెంకీ అట్లూరి సూర్యతో ఏ ప్రముఖ వ్యక్తి జీవిత కథను తెరకెక్కించాలని భావించారనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఇక వెంకీ అట్లూరి గత రెండు సినిమాలు కూడా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే సాగడంతో, మరోసారి బయోపిక్ చేస్తే కథనం రొటీన్గా అనిపించే అవకాశం ఉందని భావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సూర్య కూడా ఓ మంచి, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటించాలని కోరుకోవడంతో చివరకు వీరి కాంబినేషన్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా రూపుదిద్దుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.




