కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా చాలా కాలం తర్వాత కలిసి నటించిన సినిమా ‘వీర భద్రుడు’. తమిళంలో ‘కరుప్పు’ అనే టైటిల్తో తెరకెక్కిన ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు నిన్న శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ మూవీ, రిలీజ్ రోజే ఫ్యాన్స్కు సాలిడ్ ట్రీట్ అందిస్తూ మంచి బజ్ క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టుగానే డే వన్ నుంచే భారీ బుకింగ్స్ నమోదు అయ్యాయి.
థియేటర్లలో ఈ చిత్రానికి వస్తున్న స్పందన ఒకవైపు ఉంటే, పోస్ట్ థియేట్రికల్ రైట్స్ కూడా ఇప్పటికే లాక్ అయ్యాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ Amazon Prime Video సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే అక్కడ స్ట్రీమింగ్కు రానుంది.
ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందించగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు భారీ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో మొదలైన ‘వీర భద్రుడు’ హవా, ఓటిటిలో కూడా అదే స్థాయిలో కొనసాగుతుందేమో చూడాలి.
