ఎపీకి మోడీ…షెడ్యూల్ రెడీ…!

PM Modi Shah To Visit Andhra Pradesh In February

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 10 తేదీన గుంటూరులో, 16న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. గత జనవరి 6న కేరళ నుంచి ఏపీకి రావాల్సి ఉండగా మోదీ పర్యటన వాయిదా పడ్డ విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు విడతలుగా ఏపీలో పర్యటిస్తారని చెప్పారు. ఫిబ్రవరి 4న అమిత్ షా విజయనగరంలో బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఆపై ఫిబ్రవరి 21న రాజమండ్రిలో క్లస్టర్ మీటింగ్, పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశంలో పాల్గొంటారు.

26న ఒంగోలులో జరిగే కార్యక్రమంలో షా పాల్గొంటారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అంతా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతి అంశాన్ని తానే చేశానని ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కియా మోటార్స్ సహా ఇతర సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారని దాని ఫలితంగానే అనంతపురం జిల్లాకు కియా సంస్థ వచ్చిందని మొదట ఆ సంస్థ అధికారులు ఏపీకి వచ్చినప్పుడు టీడీపీ నేతలు కంపెనీ పెట్టకుండా అడ్డుకున్నారని ప్రధాని జోక్యంతో కియా మోటార్స్ ఏపీకి దక్కిందని కానీ సీఎం చంద్రబాబు మాత్రం అంతా తన ఘనతేనని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.