విశాఖ పట్టణం లో విడుదలైన విషయ వాయువు

విశాఖ పట్టణం లో విడుదలైన విషయ వాయువు

కరోనా భయంతోనే విశాఖ మొత్తం నిదరోతున్న వేళ ఎల్ జి పాలిమర్స్ కంపెనీ నుంచి లీకయిన స్టిరేన్ అనే వాయువు కారణంగా రెండు గంటల సమయంలో కలకలం రేపింది మొదట చిన్న మొదలయ్యి తెల్లారేసరికి తీవ్ర రూపం దాల్చింది. దీనితో ఈ వార్త విన్న ప్రతీ ఒక్కరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉండగా ఈ వాయువు బారిన పడ్డ వారి బంధువులు రోదిస్తున్నారు.

గోపాల పట్నం ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్ల మేర దీని వ్యాప్తి ఉండడంతో మొత్తం వెయ్యికి పైగా ప్రజలు మరియు పశువులు సొమ్మసిల్లిపోయాయి. అయితే అక్కడ మిగిలి ఉన్న వారు మరియు ఇలాంటి గ్యాస్ లీక్ ఇక ముందు సంభవించే పరిస్థితులు వచ్చిన దాని లక్షణాలు అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకొనే విధంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.

మొదటగ దీని లక్షణాలు విషయానికి వస్తే ఇది కళ్ళు,చర్మం మరియు శ్వాస వ్యవస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని కళ్ళల్లో మంటలు చర్మంపై దద్దర్లు ముఖ్యంగా దీనికి ఆక్సిజన్ ను చంపే స్వభావం ఉండడం మూలాన శ్వాస వ్యవసా మీద ఇది ఇంకా గట్టిగా ప్రభావం చూపుతుందని వారు తెలుపుతున్నారు. అలాగే దీనికి తగు జాగ్రత్తలు చూసినట్లయితే దీనికి మొట్టమొదటి ప్రథమ చికిత్స నీరుతోనే అని చెప్తున్నారు.

దీని ప్రభావం మొదలయిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తీసుకొని ఒక 15 నిమిషాల పాటు కడగాలని అలాగే కాంటాక్ట్ లెన్స్ ఉన్నవారు వాటని వెంటనే తొలగించాలని అలాగే తడి చేసిన మాస్కులు కానీ లేదా గుడ్డలు కానీ ముఖానికి అడ్డు పెట్టుకోవాలని సూచించారు. అంతే కాకుండా దెబ్బ తిన్న చర్మంపై దుస్తులను వెంటనే తొలగించి సబ్బుతో కడిగి శుభ్రం చెయ్యాలని నిపుణు చెప్తున్నారు.