ఉచితంగా వైద్యం అందజేస్తాము

ఉచితంగా వైద్యం అందజేస్తాము

ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఎలాంటి వ్యాధికైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

బారాబంకీలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞాయాత్రలను ప్రారంభించిన ప్రియాంక.. మహిళలకు 40% టికెట్లు, రైతు రుణాల రద్దు, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తదితర ఏడు హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే.