ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు వచ్చేవి అని చెప్పిన పునర్నవి

ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు వచ్చేవి అని చెప్పిన పునర్నవి

బిగ్‌బాస్ సీజన్ 3 రహస్యాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. తాజాగా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కుగా బయటకు వచ్చి హౌస్ లో జరిగిన సంఘటనలు అన్ని పూసగుచ్చినట్లుగా చెబుతున్నారు. తాజాగా గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన పునర్నవి…ఒక వీడియోలో హౌస్ మేట్స్ అందరి గురించి చెప్పుకొచ్చింది. ఇందులో పునర్నవి ప్రధానంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఒక్కొక్కరి టేస్ట్ గురించి చెప్పింది. బాబా భాస్కర్ చక్కగా వండుతారని, ఆయన కేరట్ తో కూడా పప్పు చేసేవాడని తెలిపింది. ఇక పునర్నవి అయితే పప్పు, నెయ్యి, పచ్చడి ఉంటే చాలు తెగ లాగించేస్తుందని చెప్పింది. అయితే ఈ సందర్భంగా పునర్నవి నోరు జారింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఇంటి నుంచి వచ్చిన టిఫిన్ బాక్సుల్లో కూడా శ్రీముఖికి పప్పు, నెయ్యి, పచ్చడి వచ్చేవని చెప్పేసింది. దీంతో నెటిజన్లు అప్పుడే రంధ్రాన్వేషణ చేయడం ప్రారంభించేశారు. బిగ్ బాస్‌లో ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముడుతుంటే తాజాగా పునర్నవి చేసిన వ్యాఖ్యలు దేనికి దారితీస్తాయో వేచిచూడాలి.