“యూరప్ చేరిన పుష్పరాజ్…అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నాడంటే?”

"Pushparaj who has reached Europe...what are you planning there?"
"Pushparaj who has reached Europe...what are you planning there?"

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు . ఈ మూవీ లో ఎలాంటి తప్పిదాలు లేకుండా దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు పుష్పరాజ్ కథ యూరప్ చేరిందంట .

"Pushparaj who has reached Europe...what are you planning there?"
“Pushparaj who has reached Europe…what are you planning there?”

‘పుష్ప-2’ కథ పలు దేశాల ల్లో సాగుతుందని.. అందుకోసం ఈ మూవీ లో వీఎఫ్ఎక్స్ పనులు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఈ మూవీ వీఎఫ్ఎక్స్ పనులని యూరప్‌కి చెందిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ జరుపుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది . ఈ వీఎఫ్ఎక్స్ సీన్స్ చాలా స్టన్నింగ్‌గా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతుంది . ఇక ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు.

అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ లో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.