పీసీసీ పదవికి రఘువీరా రాజీనామా…అందుకే ?

Raghuveera resigns for PCC

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు సమాచరం.కాగా, రఘువీరా రాజీనామాపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంతవరకూ స్పందించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే 19న ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామాను ఆమోదించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నానని అన్నారు. ఏపీసీసీ బాధ్యతను మరొకరికి ఇవ్వాలని చెప్పానని, ఎన్నికల ఫలితాలు రాకముందే రాజీనామా చేశానని అన్నారు. కాంగ్రెస్ లోనే ఉంటానని, పార్టీని వీడే సమస్యే లేదని స్పష్టం చేశారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు.