టమోటాలు, ఉల్లిపాయలు రాఖీ గిఫ్ట్ గా ఇచ్చిన నేత.

raghuveera reddy gifts Tamota and Onions to who ties rakhi him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రాలో పోయిన పరువు తిరిగి తెచ్చుకోడానికి కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. అందుకే ఏ ఒక్క ఛాన్స్ దొరికినా వాడుకోడానికి సర్వసిద్ధంగా వుంది. చివరకు పండుగల్ని కూడా వదలడం లేదు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. తాజాగా రాఖీ పండగని కూడా ఆయన రాజకీయం చేసేసారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో రాఖీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రఘువీరా కి రాఖీ కట్టారు. ఓ అన్నగా భావించి రాఖీ కట్టిన ఆ ఆడపడుచులకు రఘువీరా ఏ బహుమతి ఇచ్చారో తెలుసా ? కాసిన్ని టమోటాలు, మరి కాసిని ఉల్లిపాయలు. ఇంత కామెడీ బహుమతి ఏ అన్న ఏ చెల్లికి ఇచ్చి వుండరు. కానీ రఘువీరా ఇచ్చేసారు. ఆయన ఇలా ఇవ్వడం వెనుక రాజకీయం వుంది. ధరలు మండిపోతున్న టమోటాలు గురించి జనానికి గుర్తు చేయడం. అంతవరకు ఓకే గానీ రేట్లు తక్కువగా వున్న ఉల్లిపాయలు ఎందుకు ఇచ్చారో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం అయ్యి చావడం లేదు.
మరిన్ని వార్తలు:

పవన్ కి రోజా డోలు…జయప్రకాశ్ సన్నాయి.

మన ఎంపీలు ఈ స్థితిలో ఉన్నారా..?

కేసీఆర్ కు దత్తన్న ఆన్సర్ కామెడీ