బాబు, రాహుల్ ఉమ్మడి ప్రచారం…కలిసివచ్చేనా…?

Rahul Gandhi AP CM Naidu To Campaign Jointly In Telangana

టీఆరెస్ ని ఓడించడానికి మహాకూటమి ఏర్పడినా ఇక్కడ రాబోయే ఫలితం దేశం మొత్తం ప్రభావం చూపిస్తుందని కూటమి పార్టీలు ధీమాతో ఉన్నాయి. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక పక్షాలుగా ఉన్నాయి. అలాంటిది ఇప్పటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలూ కలిసి ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాయి. సుదీర్ఘ వైరం, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు కలవరని, క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ జరగదన్న అంచనాతో టీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ కూడా ఇదే మాట తమ మాట అభ్యర్థులకు చెప్పి ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. అయితే కేసీఆర్ అంచనా కరెక్ట్ కాదని నిరూపించేందుకు రానున్న ఎన్నికల్లో కూటమి బలాన్ని చూపించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు సంయుక్తంగా ‘రోడ్ షో’లు చేయనున్నట్లు తెలిసింది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని చంద్రబాబు నాయుడు ఇప్పటికే వెల్లడించారు.

cm-chandrababu-naidu

రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. శనివారం కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించి బీ-ఫారాలు అందించనుంది. నామినేషన్ల పర్వం ముగియగానే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం మొదలుకానుంది. ఈ నెల 22న సోనియా గాంధీ తెలంగాణలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ వస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే రాహుల్, చంద్రబాబు విడివిడిగా ప్రచారం చేయడం కన్నా ఇద్దరూ కలిసి రోడ్ షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల అధిష్ఠానాలు పరస్పరం అంగీకారానికి వచ్చాయి.ప్రధానంగా గ్రేటర్ పరిధిలో వీరి ప్రచారం ఉండనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపుగా 24 సెగ్మెంట్లలోనూ వీరి ప్రచారం ఉండే అవకాశం ఉంది. ఈనెల 22-30 మధ్య ఉమ్మడి రోడ్‌ షోలు ఉంటాయి. వరుసగా రెండు, మూడు రోజులపాటు వీటిని కొనసాగించేలా కసరత్తు జరుగుతోంది. గ్రేటర్ లో ఉన్న విభిన్నమైన పరిస్థితుల కారణంగా.. కూటమి గెలుస్తుందని నమ్మకం కలిగిస్తే ఓట్ల వెల్లువ రావడం ఖాయమే. కూటమి అధికారంలోకి వస్తుందన్న సానుకూల భావన కలిగించి, ఓట్లు చీలిపోకుండా రాహుల్, చంద్రబాబు ప్రచారం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

CBN To Meet Rahul For Anti BJP Alliance

కాంగ్రెస్, టీపీపీ ఈ సారి మహాకూటమిగా ఇరు పార్టీలు జట్టు కట్టడం టీడీపీ, కాంగ్రెస్‌లోని కొందరి నేతలు, కార్యకర్తలకు అస్సలు ఇష్టం లేదు. పైగా, తమ పార్టీ నేత టికెట్‌ను పొత్తు వల్ల ఇంకో పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడనే ఆందోళన ఇరుపార్టీ కార్యకర్తల్లో ఉంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభలతో ఒకే చోట అందరినీ ఒక చోటకు తీసుకొచ్చే బదులు రోడ్ షో ద్వారా ఇరు కార్యకర్తలను ఒకటి చేయాలనే ఆలోచనలో టీడీపీ-కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ‘కూటమి’ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటారని భావిస్తున్నారు. రాహుల్, చంద్రబాబు సంయుక్త రోడ్ షోలు సమీకరణాల్ని మార్చే అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్ ఈ విషయంలో విరుగుడు విమర్శలు ప్రారంభించింది. సీమాంధ్ర ఓటర్లలో తెలుగుదేశం పార్టీపై విశ్వాసం లేదని చంద్రబాబును నమ్మడం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ దాదాపుగా ప్రతీ మీడియా సమావేశంలోనూ అదే చెబుతున్నారు. కానీ కూటమి గనుక

Rahul Gandhi