మంచు లక్ష్మిగారు సమాధానం చెప్పండి..!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు సర్వ సాధారణం అనే విషయం తెల్సిందే. కొన్ని సార్లు గంటల కొద్ది ట్రాఫిక్‌లో సామాన్య జనాలు చిక్కుకు పోయిన సందర్బాలుంటాయి. తాజాగా మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది ఎదుర్కొంది. తాను గంటకు పైగా ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయాను, రాజకీయ నాయకులు ఇలా ట్రాఫిక్‌లో చిక్కుకుంటే వారికి పరిస్థితి అర్థం అయ్యేంది అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఆమెకు సానుభూతి చూపిస్తూ కొందరు, ఆమె వాదనకు మద్దతు ఇస్తూ కొందరు ట్వీట్‌ చేశారు. కాని రస్నా అనే అమ్మాయి మాత్రం మంచు లక్ష్మికి షాక్‌ ఇచ్చేలా రీప్లే ఇచ్చింది. ఆమె ఇచ్చిన రీప్లేకు అంతా కూడా షాక్‌ అయ్యారు.

manchu lakshmi

మంచు లక్ష్మి ట్వీట్‌కు రీప్లేగా రష్నా స్పందిస్తూ.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో కొద్ది సమయం మీకు ఉండేందుకు ఇబ్బంది అనిపించింది, ట్రాఫిక్‌లోకి రాజకీయ నాయకులు రావాలన్నారు, మీరు తిరుపతిలో దర్శనంకు వెళ్లినప్పుడు సామన్య భక్తుల క్యూలైన్లో వెళ్లండి అప్పుడు పరిస్థితి మీకు అర్థం అవుతుంది. వీఐపీ దర్శనం ద్వారా పావు గంటలో దైవ దర్శనం కానిచ్చుకు వెళ్లే మీరు ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమె ట్వీట్‌ చేసింది. రస్నా ట్వీట్‌కు మంచు లక్ష్మి నోట మాట రాలేదు.

రస్నా ట్వీట్‌ను కొన్ని వేల మంది షేర్‌ చేశారు, సోషల్‌ మీడియాలో ఆమె మంచు లక్ష్మిపై చేసిన కామెంట్స్‌కు ప్రశంసల వర్షం కురుస్తుంది. అయినా ఇప్పటి వరకు మంచు లక్ష్మి మాత్రం ఆమె ట్వీట్‌కు రెస్పాండ్‌ అయ్యింది లేదు. మొత్తానికి మంచు లక్ష్మికి షాక్‌ ఇచ్చిన రస్నాను అంతా అభినందిస్తూ, మంచు లక్ష్మి నోరు తెరిచి తిరుపతిలో వీఐపీ దర్శనం గురించి సమాధానం చెప్పాలంటూ కోరుతున్నారు. మంచు లక్ష్మి గారు మా రస్నా అడిగిన దానికి సమాధానం చెప్పి మీ నిజాయితీని నిరూపించుకోండి అంటున్నారు.