శ్రవణ్ ఒత్తిడి కారణంగా చనిపోయిన మారుతీరావు : అమృత

శ్రవణ్ ఒత్తిడి కారణంగా చనిపోయిన మారుతీరావు : అమృత

మారుతీ రావు అంత్యక్రియలు పూర్తయ్యాక మీడియా ముందుకొచ్చిన అమృత.. తన బాబాయి శ్రవణ్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ప్రణయ్‌ను హత్య చేయించింది మారుతీ రావు కావచ్చు.. కానీ ఆ హత్యకు ప్రేరేపించింది మాత్రం శ్రవణ్ అనే అర్థం ధ్వనించేలా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మారుతీరావును శ్రవణ్ కొట్టారని కూడా తనకు తెలిసిందన్న ఆమె.. ఈ విషయం మిర్యాలగూడలో చాలా మందికి తెలుసని, కానీ ఎవరూ మాట్లాడరని వ్యాఖ్యానించడం గమనార్హం.

మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నారని నమ్ముతున్నానని చెప్పిన ఆమె.. ప్రణయ్ కేసు ఒత్తిడితోనే ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారని అనుకోవడం లేదన్నారు. బహుశా శ్రవణ్ ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చాన్నారు. శ్రవణ్ అంటే మారుతీ రావు భయపడతారని.. ఇంట్లో అందరూ శ్రవణ్ మాటే వింటారని ఆమె వ్యాఖ్యానించారు. శ్రవణ్‌ లక్ష్యంగా ఆమె ఆరోపణలు గుప్పించగా.. మారుతీరావు సోదరుడు కూడా ఆమె విమర్శలకు సమాధానం ఇచ్చారు. తనకు మారుతీరావు సంపాదనలో నుంచి ఒక్క పైసా అవసరం లేదన్నారు.