వివాహితను కిరాతకంగా పొడిచి చంపిన దుండగులు

వివాహితను కిరాతకంగా పొడిచి చంపిన దుండగులు

సోమవారం రాత్రి ఇంట్లో చోరీకి యత్నించిన దుండగులు అడ్డు వచ్చిన లక్ష్మీ అనే వివాహితను అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆర్య నగర్‌లో కుటుంబంతో కలిసి నివసించే లక్ష్మి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఒంటరిగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది. ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు ఆమెను కత్తితో నరికి చంపి 5తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఆమె కాళ్ల వేళ్లు కూడా నరికేసి అనంతరం మృతదేహం ఎదుట దీపాలు పెట్టి.. ఇల్లంతా కారం జల్లి వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్త ఇంట్లోని భయానక వాతావరణాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. లక్ష్మీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. కాసేపటికే క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. దోపిడీ దొంగలే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులను అనుమానిస్తున్నారు. వివాహిత దారుణహత్య నిజామాబాద్‌‌లో తీవ్ర కలకలం రేపింది.