రెండు ప్రాణాలను బలిగొన్న లారీ

రెండు ప్రాణాలను బలిగొన్న లారీ

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ రెండు ప్రాణాలను బలిగొంది. బైక్‌ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువాతపడ్డారు. సిరివెళ్ల మండలం గోవిందాపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లో మృతి చెందారు.

లారీ ఢీకొన్న ధాటికి వారి శరీరాలు ఛిద్రమై భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులను చింతకుంట వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.