రెండు విషాద ఘటనలు

రెండు విషాద ఘటనలు

జిల్లాలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. బెస్తవారిపేట మండలం పెంచకలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ఆటోను డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నాలుగు ఆవులు కూడా చనిపోయాయి.

ఇదిలా ఉండగా, జిల్లాలోని చినగంజాం మండలం సోపిరాల రైల్వే గేటు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి.. ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.