Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్లో స్టార్ హీరో స్థాయి గుర్తింపు దక్కించుకున్న నిర్మాత దిల్రాజు. ఈయన నిర్మాణంలో సినిమాలు చేసేందుకు హీరోలు మరియు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మంచి కథలు ఎంచుకుని, మంచి కాస్టింగ్తో సినిమాను చేయగల నిర్మాత దిల్రాజు. ఈయన నిర్మాణంలో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఈ సంవత్సరంలో దిల్రాజు నిర్మించిన ప్రతి ఒక్క సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఒక చిత్రానికి దిల్రాజు ఒక హీరో లేదా హీరోయిన్ను ఫిక్స్ అయ్యాడు అంటే వారిని ఒప్పించి ఆ తర్వాత సినిమాను మొదలు పెడతాడు. కాని తాజాగా ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్రం కోసం మాత్రం దిల్రాజు అంచనాలు తప్పుతున్నాడు.
ఈ సంవత్సరం సంక్రాంతికి ‘శతమానంభవతి’ చిత్రాన్ని తీసుకు వచ్చిన నిర్మాత దిల్రాజు అదే దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాసకళ్యాణం’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ నిర్మాణంలో చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. చివరకు ఈ ప్రాజెక్ట్ కోసం నితిన్ను దిల్రాజు ఎంపిక చేయడం జరిగింది. ఇటీవలే నితిన్తో ఒప్పందం కూడా పూర్తి అయ్యింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా మొదట సాయి పల్లవిని అనుకున్నాడు. ‘ఫిదా’ సమయంలోనే సాయి పల్లవితో రెండు సినిమాలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నానితో ఒక చిత్రాన్ని చేస్తున్న సాయి పల్లవి మరో సినిమాగా శ్రీనివాసకళ్యాణం చేయాల్సి ఉంది.
ఇటీవలే దర్శకుడు సతీష్ వేగేశ్న కథను సాయి పల్లవికి చెప్పడం జరిగింది. కాని ఆ కథలోని తన పాత్ర మాత్రం సాయి పల్లవిని ఆకట్టుకోలేక పోయింది. పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే చేయాలని సాయి పల్లవి నిర్ణయించుకుంది. అందుకే ఈ సినిమాను చేయలేను అంటూ దిల్రాజుకు చెప్పేసింది. సాయి పల్లవి కోసం కథను మార్చలేమని, ఆమెను పక్కకు పెట్టి పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. దిల్రాజు సినిమాలో ఒక హీరోయిన్ నటించేందుకు నో చెప్పడం చాలా అరుదు. సాయి పల్లవి ఈ నిర్ణయం తీసుకోవడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సాయి పల్లవి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవిని టాలీవుడ్కు తీసుకు వచ్చింది దిల్రాజు. అలాంటి వ్యక్తికినో చెప్పడంను తప్పుబడుతున్నారు