‘సలార్’ టీమ్ కీలక నిర్ణయం ?

Prabhas
Prabhas

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సలార్. మొత్తం రెండు భాగాలుగా తరిగెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ యొక్క మొదటి భాగం సలార్ సీస్ ఫైర్ సెప్టెంబర్ 28 న ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో విజయ్ కిరగందూర్ నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నఈ మూవీ కీలక పాత్రల్లో శ్రియా రెడ్డి,

, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరిరావు నటిస్తున్నారు.అందరిలో భారీ అంచనాలు కలిగిన సలార్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది.

ఈనెల కారణా సల్లార్ ట్రైలర్ రిలీజ్ కానుండగా అప్పటివరకు మూవీకి సంబంధించిన టీం మెంబెర్స్ ఎవరిని కూడా ఎటువంటి మీడియా ఛానల్ ఇంటర్వ్యూస్ కానీ లేదా ఇంట్రక్షన్ గా గాని పెట్టుకోవద్దని అలానే పత్రికలకు కూడా ఎటువంటి న్యూస్ ఇవ్వొద్దని సూచించారట.

అయితే సినిమాకి సంబంధించి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారాలు వైరల్ అవుతుండడంతోనే టీమ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.