పాండిచ్చేరిలో 15 రోజులు

పాండిచ్చేరిలో 15 రోజులు

ప్రేమ కోసం పాండిచ్చేరి పయనమయ్యారు హీరోయిన్‌ సమంత. విఘ్నేశ్‌ శివన్‌ డైరెక్షన్‌లో విజయ్‌ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సినిమా చివరి షెడ్యూల్‌ పాండిచ్చేరిలో ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్‌లో సమంత పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని తెలిసింది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ఇటీవలే మైథాలజీ ఫిల్మ్‌ ‘శాకుంతలం’ షూటింగ్‌ను సమంత పూర్తి చేసిన సంగతి తెలిసిందే.