ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడి

ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడి

మీరు చేతిలోని డబ్బును ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెబుతుంటారు.

దీనికి ఎస్‌బీఐ కాంట్రా ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ 2005లో ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి చూస్తే ఈ ఫండ్ 1138 శాతం రాబడిని అందించింది.

అంటే 2005లో మీరు ఈ మ్యూచువల్ ఫండ్‌లో రూ.10 వేలు పెట్టి ఉంటే.. ఇప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.1.2 లక్షలకు పైగా అయ్యేది. ఈ ఫండ్ ఎన్ఏవీ రూ.200 సమీపంలో కొనసాగుతోంది. ఈ ఫండ్ ఎక్కువగా లార్జ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసింది.

లార్జ్ క్యాప్స్‌లో 38 శాతం మేర, స్మాల్ క్యాప్స్‌లో 32 శాతం, మిడ్ క్యాప్స్‌లో 11 శాతం మేర ఇన్వెస్ట్‌మెంట్లను కలిగి ఉంది. టాప్ 10 స్టాక్స్‌ను గమనిస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ ఫస్ట్‌లో ఉంది. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, గెయిల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్‌టెల్ వంటివి ఉన్నాయి.