అమ్మకి మాత్రమే తెలిసిన రహస్య గది ఏంటి..?

secret-room-in-jayalalitha-veda-nilayam

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కేరళలో కొన్నేళ్ల క్రితం అనంత పద్మనాభ స్వామి గదుల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరు గదుల్లో అనంత సంపద దొరకడంతో.. ఆయన తిరుమల శ్రీవారిని మించిపోయారని టాక్ వచ్చింది. చివరకు దాన్ని ప్రభుత్వం భద్రపరచడంతో.. వివాదం సద్దుమణిగింది. కానీ అలాంటి గదే జయ నివాసం వేద నిలయంలో ఉందని పుకారు వ్యాపిస్తోంది.
ఆ గదిలో ఉన్న అనంత సంపద కోసమే వేద నిలయం తమదంటే తమదని శశికళ కుటుంబీకులు, జయ మేనకోడలు పోటీ పడుతున్నారని చెన్నైలో ప్రచారం జరుగుతోంది. ఆ గదిలో లెక్కపెట్టలేనంత డబ్బు, కళ్లు చెదిరే నగలు, ఇతర డాక్యుమెంట్లు చాలా ఉన్నాయని చెబుతున్నారు. పైగా ఆ డోర్ సామాన్యంగా తెరవడం సాధ్యం కాదని, బయోమెట్రిక్ తోనే తెరుచుకుంటుందని అంటున్నారు.
ఇక బయోమెట్రిక్ అయితే అభ్యంతరమేమిటని నిపుణులు అభిప్రాయపడుతున్నా.. అది కేవలం జయ పాదముద్రల్నే తీసుకుంటుందని వార్త తెలిసి అదిరిపడ్డారు. ఇప్పుడు జయ బతికిలేరు. మరి ఆ గది సంగతేంటి, అందులో సంపద సంగతేంటి. ఏదో విధంగా గోడలు బద్దలు కొట్టి ధనాన్ని సర్కారు స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అమ్మ భక్తులు ఆ పని చేస్తారా.. లేదంటే అలాగే వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు:

ఎవరికి వారే గెలుపుల వారే