సీఎం కేసీఆర్ కు షాక్..ఇవాళ కాంగ్రెస్ లోకి బీఆర్‌ఎస్‌ నేతలు జంప్ !

Shock to CM KCR.. BRS leaders jump in Congress today!
Shock to CM KCR.. BRS leaders jump in Congress today!

ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో చేరికలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. కుంభం అనిల్ ( భువనగిరి ) సొంత గూటికి రానున్నారట. అటు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.

ఇటు మైనం పల్లి హనిమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, రేఖా శ్యామ్ నాయక్, అరేపల్లి మోహన్ ( మానకొండూర్ ) కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఇవాళ రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో మైనం పల్లి హనిమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, రేఖా శ్యామ్ నాయక్, అరేపల్లి మోహన్, కుంభం అనిల్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరనున్నారట. ఈ చేరికల తర్వాత .. రాజస్థాన్ కి ఖర్గే, రాహుల్ వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. అటు ఇప్పటికే ఢిల్లీలో షర్మిల ఉన్నారు. పార్టీ విలీనంపై కాంగ్రెస్‌ తో చర్చలు చేయనున్నారు.