తన తల్లి ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పిన సిద్దార్థ్‌ శుక్లా

తన తల్లి ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పిన సిద్దార్థ్‌ శుక్లా

తాము కోరుకున్నవి తెచ్చిపెట్టేందుకు తన తల్లి రీతూ శుక్లా ఎన్నో త్యాగాలు చేసిందని హిందీ బిగ్‌బాస్‌-13 విజేత, నటుడు సిద్దార్థ్‌ శుక్లా అన్నాడు. భర్త దూరమైనా ఏనాడు తనను తాను బలహీనురాలిగా భావించలేదని.. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగిందని పేర్కొన్నాడు. ‘‘బాలికా వధు’’ సీరియల్‌ ఫేం సిద్ధార్థ్‌ శుక్లా బిగ్‌బాస్‌-13 ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.40 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును కూడా అతడు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేతో ముచ్చటించిన సిద్దార్థ్‌… తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి తన తల్లి రీతూ శుక్లా అని పేర్కొన్నాడు. రీతూ కేవలం తనకు తల్లి మాత్రమే కాదని.. బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా అని చెప్పుకొచ్చాడు. కఠిన పరిస్థితులను ఆమె ఎదుర్కొన్న తీరు తనకు స్ఫూర్తిదాయకమని తెలిపాడు. తల్లికి దూరంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండటం తన జీవితంలోని అత్యంత కఠిన సమయాల్లో ఒకటని పేర్కొన్నాడు.